PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని విజేత.. డా. పార్థసారధి

1 min read

18,082 ఓట్లతో గెలుపొందిన కూటమి అభ్యర్థి

ఆదోని, పల్లెవెలుగు:కర్నూలు జిల్లా ఆదోని చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ జెండా రెపరెపలాడనుంది.  కూటమి (బీజేపీ–జనసేన– టీడీపీ)లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన డా. పార్థసారధి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వై.సాయిప్రసాద్​ రెడ్డిపై 18,082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికలకు 25 రోజుల ముందు కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి డా. పార్థసారధికి టిక్కెట్​ ఇచ్చారు.  ఎమ్మెల్యే  సాయి ప్రసాద్​ రెడ్డి  మూడు సార్లు గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ తాను గెలుస్తానని నమ్మకం పెట్టుకున్న సాయి ప్రసాద్​ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. నియోజకవర్గం పరిధిలో దాదాపు 2లక్షల 73వేల మంది ఓటర్లు ఉండగా… అందులో దాదాపు 1.63 లక్షల మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. కౌంటింగ్​ హాల్​లో 19 రౌండ్లు  పూర్తి అయిన తరువాత కూటమి అభ్యర్థి డా. పార్థసారధి 18,082 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్​ అధికారి/ సబ్​ కలెక్టర్​ శివ నారాయణ్​ శర్మ ప్రకటించారు. దీంతో రాత్రి 9 గంటల సమయంలో ఎన్నికల రిటర్నింగ్​ అధికారి నారాయణ్​ శర్మ ఎమ్మెల్యేగా గెలుపొందిన డా. పార్థసారధి డిక్లరేషన్​ పత్రం అందజేశారు.

About Author