PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులందరూ ఉత్తములే – ఎంఈఓ విమల వసుంధర దేవి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎంఈఓ కార్యాలయంలో, గురువారం రోజు ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో భాగంగా., ఎంఈఓ విమల వసుంధర దేవి మాట్లాడుతూ, వృత్తులలోకెల్ల ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, అందువల్ల ఉపాధ్యాయులందరూ ఉత్తములే ఆని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సమావేశంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం నాడు ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, సుజాత అన్నపూర్ణ దేవి బిలకల గూడూరు ప్రాథమికోన్నత పాఠశాల, పుల్లయ్య కరిమద్దల ప్రాథమిక పాఠశాల, లక్ష్మీ కాంత్ రెడ్డి దుర్వేసి ప్రాథమిక పాఠశాల, చంద్రశేఖర ఆచారి గడివేముల ప్రాథమిక పాఠశాల, జెసి నరసింహులు బొల్లవరం ప్రాథమిక పాఠశాల, షాహిన్ ఫాతిమా మంచాలకట్ట ప్రాధమికోన్నత పాఠశాల, నాగేంద్రం మంచాలకట్ట ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీదేవి మంచాలకట్ట ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీదేవి గడివేముల ప్రాథమిక పాఠశాల స్పెషల్, సుబ్బరాయుడు పైబోగుల ప్రాథమిక పాఠశాల. వీరిలో నరసింహులు, నాగేంద్రం హాజరుకానందున మిగిలినవారికి శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్, పిఆర్ టియు, ఏపీటీఎఫ్ 1938, ఏపీటీఎఫ్ 257 ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈఓ విమల వసుంధర దేవిని అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *