PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేను .. ఆలూరు వైసిపి ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు వైసిపి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం శుక్రవారం విజయవాడ తాడేపల్లి జగన్ నివాసంలో, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కలిసి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వాల్మీకి అయినా తనను గుర్తించి ఆలూరు వైసీపీ టికెట్ తనకు కేటాయించి ఎమ్మెల్యే చేసినందుకు జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేను అన్నారు. తాను బతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఆలూరు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే కార్యకర్తలు ఎవరు అదైనా పడవద్దు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు అండగా తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గం స్థితిగతులు, సమస్యలను జగన్మోహన్ రెడ్డికి క్షుణ్ణంగా ఎమ్మెల్యే విరుపాక్షి వివరించినట్లు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు అన్ని విధాలుగా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే విరుపాక్షిని సూచించినట్లు కూడా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో మండల కన్వీనర్ డేగులపాడు జూటూరు మారయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ డేగులపాడు మల్లికార్జున, మాజీ మండల కన్వీనర్ బెల్డోన ఓబులేసు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందన గుర్తి నాగప్ప, బుసినే శ్రీరాములు, బుసినే వెంకటేష్, వైసిపి మండల మాజీ కో కన్వీనర్ లోకనాథ్, పెద్దయ్య, చంద్ర, బాబు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

About Author