PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్యం పట్ల నిరంతరం జాగ్రత్తలు  వహించాలి  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్, జనరల్ ఫిజీషియన్    రంగనాయక్ లు అన్నారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్,బాల సాయి కంటి ఆసుపత్రి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం,సందీప్ వైద్యశాలల సంయుక్త ఆధ్వర్యంలో కల్లూరు   ముజఫర్ నగర్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆవరణలో  ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు  నాగరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ  నిర్మాణ దాత చిలుకూరి ప్రతాప్  సహకారంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న  వైద్యులను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్  ఆధ్వర్యంలో  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.అనంతరం  అవసరమైన వారికి ఉచిత కంటి  అద్దాలను కార్యక్రమంలో పంపిణీ చేశారు.

About Author