PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం కమిటీల ఎన్నిక

1 min read

మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలి

ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర ఛైర్పర్సన్ లక్ష్మి

ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు

కె రమేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఏపీ జెఎసి అమరావతి మహిళా విభాగం ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఏపీ జెఎసి అమరావతి జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్ అధ్యక్షతన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ మేరకు వారు శుక్రవారం ఏలూరు జిల్లాలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో ఏపీ జెఎసి అమరావతి జిల్లా చైర్మన్  కె. రమేష్ కుమార్  ఆధ్వర్యంలో ఏపీ జెఎసి అమరావతి మహిళా విభాగం ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లక్ష్మి  ఛైర్పర్సన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏలూరు డివిజన్ జంగారెడ్డి గూడెం డివిజన్ కమిటీల ఎన్నిక జరిగింది. ఎన్నికైన వారు మల్లేశ్వరి, రమాదేవి, ఎన్. రోజా, డి. లక్ష్మి, సత్యవేణి, ఆది లక్ష్మి, బి. ధన లక్ష్మి, పి.వి. రమాదేవి, పార్వతి, కె. హారిక, పి. సుజన. ఈ సమావేశములో  మహిళా విభాగం బలోపేతం తదితర విషయాలపై చర్చించారు. సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఛైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు పనిచేసే చోట కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇప్పటికే మహిళా ఉద్యోగుల సమస్యలను ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించలని కోరారు. అన్నీ ప్రభుత్వ కార్యాలయములలో షీ బాక్స్ లను ఏర్పాటుచేసి మహిళలకు అండగా వుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుందరి, గీతిక, శాంత కుమారి, యామిని తదితర మహిళా విభాగం జిల్లా కార్యవర్గంతో  పాటుగా అధిక సంఖ్య లో  మహిళా ఉద్యోగులను పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *