PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన కలెక్టర్​ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నూతనంగా కర్నూలు జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన  రంజిత్ భాషని కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్  ఏపీ జేఏసీ చైర్మన్ వి సి హెచ్ వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ఉద్యోగుల సహకారం చాలా అవసరం అని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలు ఏవైనా సరే నా దృష్టికి తీసుకురండి అని కలెక్టర్  తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కార్యదర్శి వీ జవహర్లాల్ కర్నూలు నగర అధ్యక్షులు ఎంసీ కాశన్న నగర కార్యదర్శి ఎం రామకృష్ణ రాష్ట్ర టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ చైర్మన్ ఈశ్వరయ్య, వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం జిల్లా అధ్యక్షులు రవి ప్రకాష్ ,వెటర్నరీ లైవ్ స్టాక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు ,మరియు కర్నూలు జిల్లా ఏపీఎన్జీవో అసోసియేషన్ కార్యవర్గం రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మధు ,అరుణమ్మ, కెసిహెచ్ కృష్ణుడు, పద్మావతి మరియు నగర కార్యవర్గం శ్రీనివాసులు, రాఘవేంద్ర ,హరికృష్ణ గౌడ్, సుభాషిని, వరలక్ష్మి రాజశేఖర్, నాగ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

About Author