PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటా సంస్థల అధినేత రతన్ టాటా మృతికి ఏపీ ఎన్జీవోస్ సంఘం సంతాపం

1 min read

కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని

ఏపీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : టాటా సంస్థల అధినేత రతన్ టాటా మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు పలువురు సంఘ సభ్యులతో సంతాపం తెలిపారు. రతన్ టాటా తో పాటు వారి వంశీకులు అందరూ భారత దేశ ఆర్థిక పరిపుష్టికి కృషి చేసి ఎన్నో పరిశ్రమలు స్థాపించి. కొన్ని లక్షల మంది కి ఉద్యోగ, ఉపాధి కల్పించారని. నిజాయితీగా నిబద్ధతతో సంస్థలును నడిపరన్నరు. దేశంలో ఉన్న ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు ఆదర్శం గా నిలిచి. భారత దేశంలో నివసిస్తున్న ప్రజలకు అతి చేరువగా ఉంటూ అన్ని రంగాల్లో ప్రజల గుండెల్లో నిలచిన వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. భారత దేశం ఒక మంచి స్నేహశీలిని ఒక స్వాపనికుడ్ని, ఉత్తమ లక్షణాలు కల్గిన వ్యక్తిని కోల్పోయిందని అటువంటి మహోన్నత వ్యక్తికి  భారత దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ని కేంద్రం  ఇవ్వాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *