PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21న నందికొట్కూరులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన

1 min read

5 గంటలకు పటేల్ సెంటర్ లో బహిరంగ సభ.

ఏపీ న్యాయ యాత్ర సభను విజయవంతం చేయండి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏపీ న్యాయ యాత్ర కార్యక్రమంలో భాగంగా  ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 21న నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటన వివరాలను నందికొట్కూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు ఆర్థర్ ,నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహా యాదవ్ లు శుక్రవారం మీడియా సమావేశంలో  తెలియజేశారు. 21న కర్నూలు జిల్లాలో పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటలకు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామాల్లోకి న్యాయ బస్ యాత్ర ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుంచి రోడ్డు షో ద్వారా సాయంత్రం 4.30 గంటలకు నందికొట్కూరు చేరుకుంటారు. క్రొత్త బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీ గా బయలుదేరి పటేల్ సెంటర్ లో బహిరంగ సభ ప్రారంభ నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షరీఫ్ , ఉండవల్లి ధర్మా రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు సద్దాం, తదితరులు పాల్గొన్నారు.

About Author