PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దొంగే దొంగ దొంగ.. అన్నట్లు జగన్ వ్యవహారం 

1 min read

మాజీ డిప్యూటీ మేయర్ అరిఫుల్లా 

పల్లెవెలుగు వెబ్ కడప : ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ వ్యవహారం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరచినట్లు ఉందని మాజీ డిప్యూటీ మేయర్ అరిఫుల్లా అన్నారు. సోమవారం ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ డీజీపీ ని ఇంటి చుట్టం మాదిరి వాడుకొని ప్రజాస్వామ్యం లో అన్ని వ్యవస్థ లను నాశనం చేసిన వ్యక్తివి నీవు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించి నట్లు ఉందన్నారు. దళితడాక్టర్ నుపిచ్చివాడిని చేసి చంపి నపుడు, ఇంకొక దళిత డ్రైవర్ ను నీ పార్టీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు నంద్యాలలో ముస్లిం యువకుని కుటుంబాన్ని, చిత్తూరు జిల్లాలో ముస్లిం అమ్మాయి చావుకు కారణం మీ పార్టీ వారైనప్పుడు ప్రజాస్వామ్యం, మానవ విలువలు గుర్తుకు రాలేదా. ఈరోజు నిన్ను నీ పార్టీని రాష్ట్ర ప్రజలు బాయ్ కాట్ చేసాక గుర్తుకొచ్చాయా అని ఆగ్రహం వ్యక్తపరచారు. ప్రజలు బాయ్ కాట్ చేసిన మీ పార్టీ అసెంబ్లీ నుండి వాక్ అవుట్ చేయడం విచిత్రం అని అరిఫుల్లా ఎద్దేవా చేశారు.

About Author