PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితుడిపై దాడి..ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు):  నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామానికి చెందిన నలుగురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు.వివరాల్లోకి వెళ్తే బుధవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మాల అందే దేవరాజు అనే యువకుడిని ఇదే గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వాళ్ళు పి భరత్ కుమార్ మరియు అతని అనుచరులు దేవరాజును బలవంతంగా భరత్ కుమార్ ఇంటిలోకి తీసుకువెళ్లి కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలు 4 గంటల పాటు అందరి ముందు నన్ను అవమానంగా కొట్టారని నిన్ను విడిపించడానికి ఎవరు వస్తారు మీ ప్రభుత్వం నన్ను ఏమి చేయలేదు అంటూ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బాధితుడు దేవరాజు నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పి భరత్ కుమార్,కౌశిక్,ఏ ప్రభాకర్ రెడ్డి,ఎర్ర నాగుల ఎంగ న్న అను వీరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

About Author