PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి 

1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘము డిమాండ్ ..

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం గ్రామస్తులు వీరి పేర్లు కురువ మల్లేష్,కురువ నాగేంద్ర,కురువ పరమేష్ మహిళలు సరస్వతమ్మ,పెద్ద రాములమ్మ వీరు కురువ సామాజిక వర్గానికి చెందినవారు పొలం విషయంలో వీరిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంజీవరెడ్డి,బాలు రెడ్డి,అర్జున్ రెడ్డి, రాఘవరెడ్డి,రామకృష్ణ రెడ్డి తదితరులు కొడవళ్లు,రాడ్లు,కర్రలతో దాడి చేసీ తీవ్రంగా గాయపరిచారు ప్రస్తుతం గాయపడిన బాధితులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు కర్నూలు జిల్లా కురువ సంఘము నాయకులు తవుడు శ్రీనివాసులు ,బి సి .తిరుపాలు ,పెద్దపాడు పుల్లన్న ,రాయలసీమ విద్యార్థి సంఘం  రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ ,సుంకన్న కర్నూలు హాస్పిటల్ కు చేరుకుని బాధితులను పరామర్శించడం జరిగింది,అలాగే సర్వజన వైద్యశాల అధికారులను కలిసి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది.తదితరులు పాల్గొన్నారు.

About Author