PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో దేవాలయ భూములు వేలం..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న దేవాలయ భూములను ప్రతి సంవత్సరం మాదిరే వేలంపాట నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏడి వెంకటరమణ తెలిపారు. శనివారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఏడి వెంకటరమణ ఆధ్వర్యంలో భూముల వేలంపాట నిర్వహించారు.రామేశ్వర స్వామి దేవాలయ భూమి 51 ఎకరాలకు వేలం పాట పాడగా రెండు లక్షల 81 వేల రూ.లు,,చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన 115 ఎకరాలకు 8 లక్షల 62 వేల రూ.లు ఒక సంవత్సరానికి వేలం పాట పాడినట్లు ఆయన తెలిపారు.2 వేల రూపాయల చొప్పున 32 మంది చెల్లించారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రూప్ దేవాలయ ఈవో కార్తీక్,రికార్డు అసిస్టెంట్ నారాయణ మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

About Author