PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వక్స్ బోర్డు స్వయంప్రతిపత్తిని హరించేందుకు కేంద్రం కుట్ర

1 min read

కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  వక బోర్డు స్వయంప్రతిపత్తిని హరించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముస్లింలను 2వ తరగతి పౌరులుగా మార్చేందుకు చేస్తుందని హిందుత్వ ఏజెండాలో భాగంగా ముస్లింల భూ యాజమాన్య హక్కులను హరించేందుకు సిద్ధమైందని విమర్శించారు. ఇందుకోసం వక్బర్డులపై గురి పెట్టిందన్నారు. వక బోర్డు ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి 40వ సవరణ చట్టం శుక్రవారం క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. ఇలాంటి చట్టాల ద్వారా వక్స్ బోర్డు ఆస్తులను తమ సొంతవిగా చెప్పుకునేందకు వీలులేకుండా మోడీ ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

About Author