PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖైదీలకు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం

1 min read

కారాగార సూపర్డెంట్ సిహెచ్ ఆర్ వి స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం

అవగాహన కల్పించిన సీనియర్ న్యాయవాది కూన కృష్ణారావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కారాగారం  సూపరింటెండెంట్ సీహెచ్.ఆర్.వి. స్వామి ఆధ్వర్యంలో నూతన చట్టాలపై ఖైదీలకు అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది & ట్రైనర్ కూన కృష్ణారావు మాట్లడుతూ భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక సురక్ష సంహిత,భారతీయ సాక్ష్య అధినీయం చట్టాలపై నియమావళి, అమలు, ఖైదీలకు కలిగే ప్రయోజనాలు,సంస్కరణలు, సమస్యలపై అవగాహన కలిగించారు.జీరో ఎఫ్.ఐ.ఆర్., ఎలక్ట్రానిక్ ఎఫ్.ఐ.ఆర్.,ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ సాక్ష్యాల వీడియో రికార్డింగ్ వగైరాలు ఈ నూతన నేర చట్టాలు అవకాశం కల్పించింది.చట్టబద్ధత గుర్తించింది.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిట్ న్యాయవాది తాళ్లూరి మధు, లయన్స్ జిల్లా నాయకులు ఎల్. వెంకటేశ్వరావు,జిల్లా జైలర్స్ కె. వెంకటరెడ్డి,కె.శ్రీనివాసరావు, డిప్యూటీ జైలర్స్ కె. సత్యనారాయణ,ఎం.కిషోర్ కుమార్ తదితరులు మాట్లాడారు.

About Author