PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని నందికొట్కూరు పట్టణ సీఐ ప్రకాష్ కుమార్ అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మరియు హిందూ మత పెద్దలతో(పీస్)శాంతి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈనెల 17న జరిగే బక్రీద్ పండుగ సోదర భావంతో పండుగను జరుపుకోవాలని అదేవిధంగా చిన్న చిన్న విషయాలకు పెద్దగా చేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి గొడవలకు తావు లేకుండా కమిటీ వారికి సీఐ సూచించారు.

About Author