PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్యాగానికి ప్రతిక బక్రీద్

1 min read

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం  : నియోజవర్గ కేంద్రమైన మంత్రాలయం లో త్యాగానికి ప్రతిక అయిన బక్రీద్ పండుగ ను ముస్లిం సోదరులు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక జామీయ మసీదు ఇమామ్ ఖాజా బందేనమాజ్ అధ్వర్యంలో తెల్లవారుజామున నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడ నుండి ఈద్గ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బక్రీద్ పండుగ ప్రాముఖ్యత గురించి ఇమామ్ చదివి వివరించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపుకున్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు గాజుల బాష, సాబ్ జాన్, నూరు అహ్మద్, ఫకృద్దీన్, ఖాజా హుస్సేన్ తాత, పింగాణి ఖాజా, షాబువలి, అక్బర్ వలి, మా భాష, నన్నే సాబ్, బాష,  అక్బర్ వల్లి ,  నూర్ ,  రఫీ, చాంద్, ఖాజ , అమీన్  ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని రాంపురం, మాధవరం, మాలపల్లి, చిలకలడోణ, సూగురు, వగరూరు, తిమ్మాపురం, సింగరాజన్నహళ్లి, తుంగభద్ర తదితరులు గ్రామాల్లో బక్రీద్ పండుగ ను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ ఎరిషావలి ఆదేశాల మేరకు మంత్రాలయం ఎస్సై గోపినాథ్ మాధవరం ఎస్సై కృష్ణ మూర్తి లు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

About Author