PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బలాన్ని ఇచ్చే బాలామృతం..

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం అందరికీ బలాన్ని ఇస్తుందని పిహెచ్ సి నాయక్, ఏఎన్ యం సుమిత్ర లు అన్నారు. శనివారం స్థానిక సంత మార్కెట్ లో ఉన్న అంగన్వాడీ 2 లో తల్లి పాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి పాలు ఎంతో స్వచ్ఛమైనదని అన్నారు. తల్లి పాలు వల్ల పిల్లలు ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. తల్లి పాలు వారోత్సవాలలో భాగంగా ఆగస్టు 1 నుండి 8 వరకు వివిధ రకాల కార్యక్రమాలు అంగన్వాడీ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమాలను గర్బవతులు, వితంతువు లు, పిల్లలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వప్న, ఏఎన్ యం లక్ష్మి బాయి తదితరులు ఉన్నారు.

About Author