PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు టిడిపి ఎంపీ అభ్యర్థిగా తొలి నామినేషన్ దాఖలు చేసిన బస్తిపాటి నాగరాజు

1 min read

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలను అందజేసిన నాగరాజు

ఎం.పి స్థానాన్ని అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం.. బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ఎం.పి స్థానాన్ని భారీ మెజార్టీ తో గెలవబోతున్నామని కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ధీమా వ్యక్తం చేశారు.. టిడిపి ఎం.పి అభ్యర్థిగా నాగరాజు తొలి నామినేషన్ దాఖలు చేశారు.. కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.. అనంతరం మీడియా తో మాట్లాడిన నాగరాజు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని మండిపడ్డారు.. తన నియంత పాలనలో అన్ని రంగాలను జగన్ నాశనం చేసాడని ఆరోపించారు…పథకాలు, నవరత్నాల పేరుతో జగన్ 13 లక్షల కోట్లు అప్పు చేసి, ఒక్కొక్కరి పై 2లక్షల అప్పు మోపాడన్నారు.. ఈ నామినేషన్స్ తో వైసిపి ప్రభుత్వం గద్దె దించేందుకు బీజం పడిందన్న నాగరాజు.. మే 13 న జరిగే పోలింగ్ రోజు మంచి పాలన చేసే టిడిపి పార్టీకి ఓటు వేయాలని కోరారు..ఇక కర్నూలు కరువు, వలసలకు నిలయంగా మారిందని .. తాను ఎం.పి గా గెలిచిన వెంటనే వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు, వలసలను నివారిస్తానని..అలాగే పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలో తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తామని హామీ ఇచ్చారు.

About Author