చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలి
1 min readవై. నాగేశ్వరరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ లోని వాల్మీకి భవనం నందు బీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. నాగేశ్వరరావు యాదవ్ గ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ , సత్యనారాయణ మహేష్ సత్యనారాయణ శ్రీనివాస్ రావు చైతన్య విజయ్ మురళి అప్పారావు వీర్రాజు మహేష్ సతీష్ కుమార్ , భార్గవి , చిట్టి బాబు ,శ్రీను , లక్ష్మీ ఉమామహేశ్వరరావు వెంకటేష్ అమల సత్యవతి , పవన్ , ధనలక్ష్మి ,వరలక్ష్మి , సతీష్ కుమార్ , హరి కిషోర్ మహేష్ గోపి ఇసాక్ నాగరాజు చందు ,అలివేలు ,రాజశేఖర్ , లక్ష్మీ వెంకటేశ్వర్లు రమణమ్మ వెంకటరమణ అప్పారావు , మొదలైన బీసీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ:చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా, కేంద్ర ప్రభుత్వ స్థాయి లో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీలు అన్ని కులాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా ఎదగడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని నెలకొల్పడం జరిగింది. ఉద్యమ ఫలితంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు రక్షణ చట్టం తెస్తానని చెప్పడం జరిగింది. బీసీలలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం, 37 వేల కోట్లు బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ను ఇస్తానని చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల్లో బీసీ భవన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు బీసీలకు 50% శాతం ఇస్తాను అని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం 24% ఇస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం జరిగింది. బీసీల అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబునాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదములు ఈ సందర్భంగా తెలియజేశారు. బీసీల యొక్క డిమాండ్లను కూటమి ప్రభుత్వానికి ఇంతకుమునుపే సమర్పించడం జరిగింది. దానిని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా మేము చేస్తున్నాం అలాగే బీసీల కులగననా వెంటనే చేపట్టి పార్లమెంటుకు పంపాలని విన్నవిస్తున్నాం.