PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిసివై పార్టీ ఆవిర్భావ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : రాబోయే 2029 లో BCY పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ని ముఖ్యమంత్రి చేసుకుందాం._ బిసివై పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాట్లాడుతున్న కర్నూలు జిల్లా BCY పార్టీ పార్లమెంట్ ఇన్చార్చి ఎల్లార్తి అర్జున్._BCY పార్టీ స్థాపించి మొదటవ సంవత్సరం ముగించుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సంధర్భంగా ఎల్లార్తి అర్జున్  మాట్లాడుతూ రాబోయే 2029 వ సార్వత్రిక ఎన్నికల్లో బిసి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ధృఢ సంకల్పంతో పెట్టిన పార్టీ BCY పార్టీ. కావున రాష్ట్రంలో ప్రజలు అబివృద్ది చెందాలంటే,పెండింగులో వున్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే,యువతకు ఉద్యోగ ఉపాధి రావాలంటే,బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే, ఎస్సి,ఎస్టీ,బిసి,మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే మన బిసి నాయకుడు BCY పార్టీ రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి కావాలని 22 మరియు 23 వ తేది జరిగిన BCY పార్టీ సమావేశంలో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం పరిధిలో వున్న నగరడొణ రిజైర్వర్ మరియు వేదావతి నది ప్రాజెక్టును పూర్తి చేయడానికి అలాగే వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించడానికి,రాష్ట్రంలో  పసి బాలికలపై నిరంతరం జరగుతున్న హత్యాయత్నాల గురించి మీ వంతుగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు తెలియ పరచి అన్ని విధాలుగా కృషి చేయాలనీ బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందుకు రామచంద్ర యాదవ్  స్పందిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ సమస్యల పై నేను పోరాటం చేసి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిసివై పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author