PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఎస్సి ఫలితాలలో భాష్యం విజయకేతనం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  ఎస్ఎస్సి 2024 ఫలితాలలో నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలని భాష్యం పాఠశాల నందు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు కైవసం చేసుకొని సత్తా చాటిన భాష్యం పాఠశాల. 100% ఉత్తీర్ణత నిలిచిన ఏకైక పాఠశాల. ఈ పరీక్షకు 23 మంది విద్యార్థులు హాజరు కాగా, పాఠశాలలో అత్యధికంగా 581 మార్కులతో మొదటి స్థానం సాధించాడు. ఇందులో 550 పైగా 9 మంది విద్యార్థులు 500 లకు పైగా 3, మరియు 400 లకు పైగా 8 మంది విద్యార్థులు ఉన్నారు.భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ , డైరెక్టర్ హనుమంతరావు  రాయలసీమ Z.E.O అనిల్ కుమార్  విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించాలని ప్రణాళికలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తూ మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఎంత గానో తోడ్పాటును అందించారు. ప్రిన్సిపల్ హలీమ మేడం , విద్యార్ధిని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపిన స్వీట్స్ అందజేసి వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో బాన సంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

About Author