PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజినవేముల సర్పంచ్ రవి వైసీపీకి షాక్..

1 min read

తెదేపా లో చేరిన మండల కన్వీనర్ సర్పంచ్ రవి యాదవ్ భారీగా అనుచరులు..

అదే బాటలో మల్యాల నాయకులు టీడీపీ లోకి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలో వైసీపీ పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామ వైసీపీ సర్పంచ్ మరియు నందికొట్కూరు వైసీపీ మండల కన్వీనర్ కేతం రవి యాదవ్ అల్లూరులో శివానందరెడ్డి స్వగృహంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు మాండ్ర ఉమాదేవి ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.సర్పంచ్ కె.రవి యాదవ్ తో పాటు భారీగా ఆయన అనుచరులు 200 కుటుంబాలు మరియు మహిళలు అధికంగా తెదేపాలో చేరారు.ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.తర్వాత ఎమ్మెల్యేకు మరియు మాండ్ర దంపతులకు శాలువాలు భారీ గజమాలతో రవి యాదవ్ సన్మానించారు.మాండ్ర ఉమాదేవి మహిళలకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని మీరు ఎప్పుడైనా సరే పనుల నిమిత్తం రావచ్చని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని శివానందరెడ్డి ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.మీ అందరికీ పార్టీ అండగా ఉంటుందని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని అన్నారు.సర్పంచ్ రవి యాదవ్ తో పాటు వార్డ్ మెంబర్లు లలితమ్మ,మనోజ్ఞ,పద్మావతి, సరోజమ్మ,మహమ్మద్ రఫీ, మాసుం,ఏసురత్నం, మరియమ్మ,చికెన్ శ్రీనివాసులు మరియు నాయకులు సురేష్ బాలు నాగ శేఖర్ శ్రీను విజయ్ తదితరులు పార్టీలో చేరారు.బుధవారం ఉదయం మల్యాల గ్రామానికి చెందిన బాల మద్దయ్య,మద్దిలేటి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు రాముడు,గుర్రం బండి వెంకటేశ్వర్లు,కర్ణ,పర్ల ముని,రాజు,పవన్ తదితర కుటుంబాలు అల్లూరులో ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి సమక్షంలో టిడీపీ లో చేరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *