PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి

1 min read

పల్లెవెలుగు  వెబ్  ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరులో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాశీం వలి ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు విరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి  ఆదేశాల మేరకు ఏమన్నా మీరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసిం వల్లి, విద్యార్థి నాయకుడు విరేష్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరించడం సబబు కాదని రాహుల్ గాంధీ అన్ని కులాలను, మతాలను గౌరవిస్తారని బిజెపి నాయకులు మత విద్వేషాలు సృష్టించడం సబబు కాదని పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాటలను మోడీ వక్రీకరించి బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ నాయకులను రెచ్చగొట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం ఎంతవరకు సమంజసమని మీరు మీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బాబురావు  హెచ్చరించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పద్ధతులు మానేయాలని ఎక్కడ ఉనికి కోల్పోతామోనని మోడీ, అమిత్ షాలు నాటకాలు ఆడుతున్నారని ఆలాంటి నాటకాలు విరమించు కోవాలని దేశ ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం మంచి పద్ధతి కాదని కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగించిందని కుల మతాలను రెచ్చగొట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి లేదని హితవు పలికారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు దహనం చేస్తున్నారని వాటిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టడం జరిగినదని తెలియజేశారు. రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని వీరుడిమాండ్ చేశారు.  పార్లమెంటులో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రతో దేశ ప్రజల మన్ననలు పొందాడని అలాంటి రాహుల్ గాంధీ పైన మోడీ అమిత్ షా లు కక్షగట్టి ఇల్లును ఖాళీ చేయించారని పార్లమెంట్లో  రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ  మాటలను మోడీ అమిత్ షాలు వక్రీకరించి బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులను రెచ్చగొడుతున్నారని అలాంటి పద్ధతులు మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ  అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రధాని నరేంద్ర మోడీ తడబడుచున్నారని రాహుల్ గాంధీ  పార్లమెంటులో ప్రధాని చేసిన అన్యాయాలను తప్పుబట్టి నీరు తాపిస్తున్నాడని. ప్రధాని మోదీ  దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మోడీపై ఉందని కానీ సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ  పైన ఆయన మాటలను వక్రీకరించి అబాండాలు వేసి బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులను రెచ్చగొడుతున్నారని ఇప్పటికైనా ఇలాంటి నీతిమాలిన చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ బిజెపి ఆర్ఎస్ఎస్ మోదీ అమిత్ షా లు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాదాకలందర్,విష్ణు, షబ్బీర్, రఫీక్,హర్ష,లోకేష్,ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు.

About Author