PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆశీర్వదించండి..

1 min read

3వ వార్డులో పర్యటించిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​

కర్నూలు, పల్లెవెలుగు:ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని మూడో వార్డులో కర్నూల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి A.Md. ఇంతియాజ్ , కర్నూలు వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అభ్యర్థి BY రామయ్య, కర్నూలు మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు మోయిద్ ఖాన్, వైసిపి నాయకులు తదితరులు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.  అనంతరం A.Md.ఇంతియాజ్ మాట్లాడుతూ నేడు పేదలకు అందుతున్న పథకాలు అన్ని కొనసాగాలి అంటే కచ్చితంగా వైయస్సార్సీపీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని వారిని కోరారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author