PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆశీర్వదించండి.. అందుబాటులో ఉంటా..

1 min read

సేవ చేసేందుకే వచ్చా…

  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
  • పెద్దపెండేకల్​, ఆరెకల్​లో కూటమి ప్రచారానికి విశేష స్పందన

ఆదోని, పల్లెవెలుగు: ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ఒక్క అవకాశం ఇస్తే… అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. గురువారం నియోజకవర్గంలోని పెద్దపెండేకల్​, ఆరేకల్​లో కూటమి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామానికి రాగానే డా.పార్థసారధికి పూలమాల వేసి…ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ భూకబ్జాదారుడు…అవినీతి పరుడు…రౌడీ ఎమ్మెల్యే పోతేనే…. ఆదోని అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా భూ కబ్జాలే అధికంగా ఉన్నాయన్నారు. ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యే… సెంటు భూమి ఖాళీ కనిపిస్తే గద్దల్లా ఆయన అనుచరులు దిగి… పాగా వేస్తున్నారని, ఇదేమిటని అడిగిన బాధితులకు బెదిరింపులు అధికమయ్యాయని ఆరోపించారు. పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్​ రెడ్డి …నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఊరు బాగు పడాలంటే.. ఎమ్మెల్యే మారాలి… అనే నినాదంతో ముందుకెళ్తున్న తమకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే… తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author