PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి

1 min read

ప్రజలను అభ్యర్థించిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పేదల సంక్షేమానికి ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రజలను అభ్యర్థించారు. సోమవారం ఉదయం మాజీ ఎంపీపీ ఎస్. నాగరత్నమ్మ,ఎంపిపి నారాయణ దాస్, సర్పంచ్ కొమ్ము దీపిక, వైస్ సర్పంచ్ పల్లె కళావతి, బిసి సెల్ జిల్లా అధ్యక్షులు సోమ శేఖర్తో కలసి పత్తికొండ పట్టణం హోసూరు రోడ్డు, రాందాస్ నగర్, లక్ష్మీ థియేటర్ వెనుక లక్ష్మీ నగర్ లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీవీ రామయ్యను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పటి వరకు పత్తికొండ నియోజకవర్గాన్ని జగనన్న సాయంతో ఎంతో అభివృద్ధి చేశానని,మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధికి బేరీజు వేసుకుని మంచి చేసే పార్టీకే ఓటు వేయాలని కోరారు. గతంలో సంక్షేమ పథకాల కోసం రాజకీయనాయకులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, మన ప్రభుత్వ వచ్చిన తర్వాత ప్రతి గడప వద్దకే వాలంటీర్లను నియమించి లంచాలకు తావు లేకుండా సంక్షేమ అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులు,ఎంపీటీసీ సభ్యులు,వార్డ్ మెంబర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author