PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాల జిల్లా నూతన ఎస్పి ని మర్యాదపూర్వకంగా కలిసిన బొజ్జా దశరథరామిరెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లాకు నూతన ఎస్పీ గా బాద్యతలు చేపట్టిన అధిరాజ్ సింగ్ రాణాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి. బొజ్జా దశరథరామిరెడ్డి నేతృత్వంలో సమితి నాయకులు సోమవారం  ఎస్పీ ని కలిసారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సమస్యలు వాటి పరిష్కారాలతో విశ్లేషణాత్మకంగా వివరణలతో కూడిన  “నీటి అవగాహనే రాయలసీమకు రక్ష” పుస్తకాన్ని ఈ  సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా కి దశరథరామిరెడ్డి అందచేసారు. ఎస్పీ ని కలిసిన బృందంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, మహమ్మద్ పర్వేజ్, భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, సుబ్బారెడ్డి, కొమ్మా శ్రీహరి, రాఘవేంద్రగౌడ్, నిట్టూరు సుధాకర్ రావు వున్నారు.

About Author