PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జయసూర్యకు… బ్రహ్మరథం

1 min read

పూల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు

నందికొట్కూరు (మిడుతూరు), పల్లెవెలుగు:నంద్యాల జిల్లా నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్యకు నందికొట్కూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఆయనకు ప్రజలు పూల వర్షంతో బ్రహ్మరథం పట్టారు. మంగళవారం పట్టణంలోని ముందుగా కోటా వీధిలో ఉన్న సూర్యనారాయణ దేవాలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఏబీఎం,సీఎస్ఐ పాలెం,కోటా వీధి,చాకలిపేట, ఎరుకలి వీదుల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మీకున్న రెండు ఓట్లను నాకు మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అదేవిధంగా టిడిపి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.నేను ఈ పట్టణం పక్కనే అల్లూరు గ్రామానికి చెందిన వాడను ఎల్లవేళలా మీ కు అందుబాటులో ఉంటానని మీ ఆశీస్సులు నాపై ఉంచి నన్ను గెలిపిస్తే మీ రుణం తీర్చుకోలేనని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నాగ సురేష్,రవయ్య, కిరణ్ నిమ్మకాయల మోహన్ జాన్ కళాకర్ శ్రీను వంశీ ప్రేమ్ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author