PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుడ్డా గెలుపై ఆర్యవైశ్యుల హర్షం 

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా  బుడ్డా  రాజశేఖర్ రెడ్డి,  శిల్పా చక్రపాణి రెడ్డి పై పోటీ చేసి 5941 ఓట్లతో విజయం సాధించడం పట్ల పట్టణ  ఆర్యవైశ్య తెలుగుదేశం పార్టీ ప్రముఖులు తమ హర్షం వ్యక్తం చేశారు.  మంగళవారం త్రిపుర రైస్ మిల్ తాళ్లూరు సంజీవ రాయుడు, కిరాణం లాలం నాగార్జున, శంబు రామయ్య, తల్లం సుమంత్  పాత్రికేయులతో మాట్లాడారు.  ఆర్యవైశ్యులంతా సమైక్యంగా ఉండి బుడ్డ రాజశేఖర్ రెడ్డి విజయం కోసం కృషి చేశామని  ఆయన విజయం   పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.  శ్రీశైలం నియోజకవర్గం లో ఆర్యవైశ్యుల సంక్షేమం – అభివృద్ధి  కోసం బుడ్డా రాజశేఖర్ రెడ్డి కృషి చేస్తారని  అన్నారు.  అనంతరం బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.  ఈ కార్యక్రమంలో భగవాన్ క్లాత్ స్టోర్ మల్లి కార్జున, తల్లం సురేష్ బాబు,  వరద కార్తీక్ పాల్గోన్నారు.

About Author