PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నీరాజనాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలీ పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ప్యాపిలి పట్టణ మహిళలు నీ రాజనాలు తెలియజేస్తూ ఘనంగా స్వాగతిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని నడిమికేరిలో నుంచి నేసే పేట మీదుగా ఆయన ర్యాలీగా వెళ్లారు. ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయశక్తితో ఉన్నారు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వలన మహిళలు ఈరోజు స్వయశక్తితో ఉన్నారంటూ ఆయన తెలిపారు.మహిళల కోసం వైఎస్ఆర్సిపి పార్టీ ఎల్లప్పుడు పనిచేస్తుందని, డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన పనులను మహిళలకు తెలియజేస్తూ, మళ్లీ నన్ను గెలిపిస్తే ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని మహిళలకు వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి ,మొట్టి వెంకటేశ్వర్ రెడ్డి, బోర మల్లికార్జున రెడ్డి,పోతుదోడ్డి కృష్ణమూర్తి ,బో రెడ్డి రఘునాథ్ రెడ్డి, బండ సోమశేఖర్ ,యాదాటికిష్టప్ప, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author