PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బన్నీ ఉత్సవాలను ప్రజలందరూ శాంతియుతంగా జరుపుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  దసరా పండుగ పురస్కరించుకుని రాబోవు దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవమును ప్రజలందరూ శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని, ఎవరు కూడా ఇనుప రింగులు తొడిగినటువంటి కర్రలను దేవరగట్టుకు తీసుకువెళ్లకూడదని హెచ్చరించడం జరిగినది. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనను పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను తనపై ఆధారపడినటువంటి భార్యా, పిల్లలను దృష్టిలో ఉంచుకొని బన్నీ ఉత్సవంలో ఎలాంటి గొడవలలో తల దూర్చకుండా సంతోషంగా పండుగ జరుపుకోవాలని తెలియజేయడమైనది. గౌరవ కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు 100 కు పైగా సీసీ  కెమెరాలతో మరియు 5 డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం జరుగుతుందని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడమైన ది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *