PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ విస్తృత ప్రచారం

1 min read

ఎంపీ, ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి

చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషన్ తో కలిసి రోడ్ షో 

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గం,లింగపాలెం మండలం,మట్టంగూడెం, లింగపాలెం గ్రామములలో రోడ్ షో నిర్వహించడం జరిగింది.ఈ ప్రచారంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్ ,స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ సంఖ్యలో పాల్గొన మన ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ని, ఎమ్మెల్యే అభ్యర్థిగా  సొంగ రోషన్ కుమార్ ని అఖండ మెజార్టీ గెలిపించాలని ఓటర్లను శిరస్సువంచి అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొనే విజయవంతం చేశారు.

About Author