PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిసివై పార్టీ పత్తికొండ నియోజకవర్గం అభ్యర్థి టిడిపిలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ నియోజకవర్గo ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు టిడిపిలో చేరిపోయారు. బీసీవై పార్టీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన మిద్దె వెంకటేశ్వర్లు టిడిపి నియోజకవర్గ అభ్యర్థి కె ఈ శ్యాంబాబు,టీడీపి రాష్ట్ర నాయకులు తుగ్గలి నాగేంద్ర ఆధ్వర్యంలో సోమవారం బీసీవై పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి  ఆయన బీసీవై పార్టీ కార్యకర్తలు చేరారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీసీవై పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని విత్ డ్రా చేసుకొని టిడిపిలోకి చేరానని అన్నారు. బిసివై పార్టీ పత్తికొండ అభ్యర్థి అయిన మిద్దె వెంకటేశ్వర్లకు టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.మిద్దె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మా సొంత గ్రామము జొన్నగిరి గ్రామాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దత్తత తీసుకుందని. గత ఐదు సంవత్సరాల కాలంలో మా గ్రామంలో కనీసం తాగునీటి సమస్యను కూడా తీర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు.ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రము ఐదు సంవత్సరములు వెనక్కి పోయిందని అన్నారు. ఈ వైసిపి పాలనలో గ్రామాలు ఏలాంటి అభివృద్ధి జరగలేదని మిద్దె వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులమై బీసీవై పార్టీ నుండి టిడిపిలోకి చేరామని అన్నారు. రేపు నెల 13వ తారీకు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కె ఈ శ్యాంబాబు కు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

About Author