PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిప్పగిరి ఎంపీపీ కారు పై కప్పు ..రాత్రి ధ్వంసం

1 min read

ధ్వంసమైన కారును పరిశీలించిన ఎమ్మెల్యే విరుపాక్షి

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : చిప్పగిరి ఎంపీపీ డేగులపాడు జూటూరు హేమలత కారును బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఎంపీపీ స్వగృహం గుంతకల్లుకు గురువారం సాయంత్రం వెళ్లి వారిని ఓదార్చే, ధ్వంసమైన కారును పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ చిప్పగిరి వైసీపీ ఎంపీపీ జూటూరు హేమలత, మండల కన్వీనర్ డేగులపాడు మారయ్య కు సంబంధించిన వాహనాన్ని అర్ధరాత్రి టాపు అద్దాలు ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మారయ్య ఎంపీపీ హేమలత కారును ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్థానిక పోలీసులతో పాటు అనంతపురం జిల్లా ఎస్పీని ఎమ్మెల్యే కోరినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ సీనియర్ నాయకులు చిప్పగిరి మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, లోక్నాథ్, కాజీపురంనాగరాజు, నారాయణస్వామి, కాజీపురం మహాస్వామి, తదితరులు పాల్గొన్నారు.

About Author