PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ప్రధాని  నరేంద్ర మోడీ  74 వ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ హొళగుంద:  హొలగుంద మండలంలో ని జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న గుడి ఆవరణంలో భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ  74 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు ఏఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో  నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బళ్లారి చెందిన శరణ పాటిల్  ముఖ్య వక్తగా వచ్చి వారి యొక్క అమూల్యమైన విషయాలను సభను ఉద్దేశించి మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ప పర్యావనాన్ని రక్షించాలని ప్రతి విద్యార్థికి మొక్కను పెంచి పర్యావనాన్ని రక్షించాలని ప్రతి ఒక్కరికి ఒక్క మొక్కను ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెందిన ప్రిన్సిపాల్ కే .ప్ర వీణ , కేజీబీవీ ప్రిన్సిపాల్ మీ దివ్య భారతి , జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ సుధ  జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ముఖ్య వక్తగా వచ్చిన శరణ పాటిల్   దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో సభను ఉద్దేశించి వివరించడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ నెంబర్ చిదానంద, సభను ఉద్దేశించి మోడీ గురించి మాట్లాడడం జరిగింది . ముఖ్య అతిథిగా వచ్చిన అద్వాల శేషి రెడ్డి  ఈయన భారత్ దర్శన్ గురించి చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుపమ బిస్వాస్ సీనియర్ నాయకులు జక్కన్న చారి, మండల వైస్ ప్రెసిడెంట్ జాన్ టి వీరేష్, మండల ప్రధాన ప్రధాన కార్యదర్శులు మహేష్ ఉల్లి గన్న, జిల్లా కిసాన్ మోర్చా  l కార్యదర్శి రామలింగ, మల్లయ్య, వెంకటేష్, మండల యువ మార్చా అధ్యక్షులు బసవ, ఎంకప్ప, దుర్గాప్ప రంగస్వామి బెనకప్ప, రామాంజనేయులు వెంకటరెడ్డి, బిజెపి కార్యకర్తలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *