PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కులమతాలకు అతీతంగ మొహరం వేడుకలు

1 min read

తుంగభద్ర నది లో పీర్లను నిమజ్జనం

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: త్యాగానికి ప్రతిక గా కులమతాలకుఅతీతంగా జరుపుకునే మొహరం పండుగ వేడుకలు బుధవారం గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీర్ల చావిడి లో కొలువైన హసన్ హుశేన్, ఇమాం ఖాశీం పీర్ల ను తుంగభద్ర నది వరకు భక్తులు హర్షధ్వనుల మద్య డప్పు కళాకారుల మద్య ఊరేగించారు. తుంగభద్ర నదిలో పీర్ల దేవుళ్లను నిమజ్జనం చేశారు. అలాగే మండల పరిధిలోని మాధవరం, మాలపల్లి, సుంకేశ్వరి, వగరూరు, తిమ్మాపురం, చిలకలడోణ, కల్లుదేవకుంట, సూగురు, సింగరాజన్నహళ్లి తుంగభద్ర, రాంపురం, బసాపురం, రచ్చమరి తదితర గ్రామాల్లో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ ఎరిషావలి ఆదేశాల మేరకు మంత్రాలయం ఎస్సై గోపినాథ్, మాధవరం ఎస్సై కృష్ణ మూర్తి తమ పోలీసు సిబ్బంది తో బందోబస్తు నిర్వహించారు.

About Author