PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహ నిర్మాణ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు

1 min read

బాధ్యతాయుతంగా పనిచేస్తే మంచి గుర్తింపు

మేయర్ నూర్జహాన్ పెదబాబు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గురువారం  ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులకు ఏలూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్, జెసి పి ధాత్రి రెడ్డి సమక్షంలో ఉత్తమ అధికారులుగా ప్రశంసా పత్రాలు అందుకున్న వారు అడిషనల్ కమిషనర్ చంద్రయ్య , హెల్త్ ఆఫీసర్ డాక్టర్:మాలతి,  ఇంజనీరింగ్ విభాగం నుండి ఎస్.ఇ వెంకటేశ్వరరావు డి.ఇ కొండలరావుకి కొత్తమాధికాలు గా ప్రశంస పత్రాలు అందజేశారు. నగరపాల సంస్థ అధికారులు, ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది వారిని హర్షద్వనాలతో ప్రశంసించారు. విధులలో అంకితభావంతో పనిచేయాలని, మంచి గుర్తింపు లభిస్తుందని మేయర్ నూర్జహాన్ పెదబాబు కొనియాడారు.

About Author