PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం..

1 min read

ప్రారంభించిన జడ్పీ సీఈవో సుబ్బారావు

పాల్గొన్న సంఘ కార్యదర్శి నెరుసు రామారావు,సభ్యులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జడ్పీ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు  ఆధ్వర్యంలో స్థానిక ఎన్ ఆర్ పేట జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా  చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలం దృశ్య భానుడి  తాకిడికి నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా ఉన్నత అధికారులు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చేస్తున్న సూచనల మేరకు. నగర ప్రజలు కూడా పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. దీనిలో భాగంగా వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు అందుబాటులో ఉండేలా జిల్లా పరిషత్ మెయిన్ రోడ్ ఆనుకుని చలివేంద్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ సుబ్బారావు  చేతుల మీద. డిప్యూటీ సీఈఓ ఎస్ నిర్మల జ్యోతి తో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ ఆర్ ఎస్ హరనాధ్, ఏలూరు తాలూకా అధ్యక్షుడు జి.శ్రీధర్, సెక్రటరీ కప్పుల సత్యనారాయణ, బేగ్, జిల్లా పరిషత్ ఆర్వో హరికృష్ణ, ఎన్జీవోస్ అసోసియేషన్ మహిళా విభాగం ఛైర్పర్సన్ కె నాగమణి, ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author