PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఛత్రపతి శివాజీ హైందవ శ్రేష్ట పురస్కారానికి సూర్యనారాయణ చార్యులు ఎంపిక

1 min read

పురస్కారాన్ని అందజేయనున్న హిందూ ఉపాధ్యాయ సమితి వ్యవస్థాపక  జాతీయ అధ్యక్షులు మహేష్ డేగల

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : హిందూ ఉపాధ్యాయ సమితి ఆర్గనైజేషన్  ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తమ సంస్థ నుండి ఉత్తమ ఉపాధ్యాయులకు మరియు ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమంలో ప్రతిభ కనబరచిన  ప్రముఖులకు హిందూ ధార్మిక సమితి పేరుపైన వ్యాస పురస్కారాలను  ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని హిందు ఉపాధ్యాయ సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహేష్ డేగల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కర్నూలు పట్టణం లోని టీజీవి కళాక్షేత్రంలో ఆదివారం నాడు వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో విద్యావృతిలో   ఉత్తమ ప్రతిభ కనబరిచిన  ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రంలోని 118 మంది ఉపాధ్యాయులకు,వ్యాస పురస్కారాలను  మరియు  ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 29 మందికి ఛత్రపతి శివాజీ  హైందవ శ్రేష్ట అనే పురస్కారాలను ఇచ్చి సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మంత్రాలయంకు చెందిన సూర్యనారాయణ చార్యులకు హైందవ శ్రేష్ట అనే  పురస్కారాన్ని ఇచ్చి,సత్కరించడం  జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి కురువ చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

About Author