PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలపల్లి..రోళ్లపాడు దేవాలయాల్లో చోరీ..

1 min read

వస్తువులు నగదు అపహరణ-భయాందోళనలో మండల ప్రజలు..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో పట్టపగలే దొంగతనాలు మితి మీరుతున్నాయి.మండలంలో శుక్రవారం రెండు దేవాలయాల్లో ఉదయం చింతలపల్లి లో సాయిబాబా దేవాలయంలో గేటు తాళం మరియు హుండీ ని పగలగొట్టి వీటిలో ఉన్న నగదు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు.అదేవిధంగా రోళ్లపాడు గ్రామంలో మారెమ్మ గుడిలో ఉదయం 11 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మ వారి చీరలు,కంచు హరతులు 4 జతలు ముక్కురాయి దొంగిలించారని గ్రామస్తులు తెలిపారు.రెండు గ్రామాల్లో ఒకేరోజు దొంగతనాలు జరిగిన దేవాలయాలను ఏఎస్ఐ సుబ్బయ్య పరిశీలించారు.రోళ్లపాడు దేవాలయం దగ్గర రాడ్ దొరికింది వాటిని స్వాధీనం చేసుకున్నామని ఏఎస్ఐ తెలిపారు.గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ అన్నారు.కానీ మండలంలో ఒకే రోజు పట్టపగలే రెండు దేవాలయాల్లో చోరీలు జరగడం పట్ల మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

About Author