PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రచార జోరు

1 min read

చంద్రబాబుతోనే రాష్ట్రానికి సంక్షేమం,అభివృద్ధి సాధ్యం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :ఇంటింటా ఎన్నికల ప్రచారం లో భాగంగా చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ కామవరపుకోట మండలం విస్తృత ప్రచారం చేశారు. వడ్లపల్లి, రామన్నపాలెం, కొత్తూరు మీదుగా ఉప్పలపాడు గ్రామాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం 2:45 నిముషాల వరకు మండుటెండను సైతం లెక్కచేయకుండా గడపగడపకు చంద్రన్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.చంద్రబాబు  ముఖ్యమంత్రి కావాలాని, పుట్టా మహేష్ ఏలూరు ఎంపీగా, సొంగా రోషన్ కుమార్ ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో గెలవాలని పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళా లు పెద్ద ఎత్తున కోరుకుంటున్నరు.ఈ ప్రచారం లో ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు,  కార్యకర్తలు,వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author