PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెవిన్యూ డే ని ఘనంగా నిర్వహించేందుకు సర్కులర్ జారి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జాయింట్ కలెక్టర్  శ్రీమతి నారపురెడ్డి మౌర్య ఐఏఎస్. , ని APRSA ఆధ్వర్యములో కలిసి ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 20 వ తేదీన రెవిన్యూ డే  గా డిక్లేర్ చేస్తూ G.O.Ms.No.81  తేదీ 04/03/2024  జారీ చేసినందున జూన్ 20 వ తేదీన జిల్లాలో రెవిన్యూ డే ని ఘనంగా నిర్వహించుటకు  సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వవలెనని కోరడమైనది. దీనికి ప్రతిగా జాయింట్ కలెక్టర్  సానుకూలంగా స్పందించి వెంటనే జిల్లాలోని అందరూ రెవిన్యూ అధికారులకు రెవిన్యూ డే ని ఘనంగా జరుపవలెనని సర్కులర్ వెంటనే పంపమని జిల్లా రెవిన్యూ అధికారికి ఆదేశాలివ్వడం జరిగినది. జాయింట్ కలెక్టర్ ని కలిసినవారిలో జిల్లా కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి వెంకటరాజు, కోశాధికారి వేణుగోపాల్ రావు, లోకేశ్వర్ రెడ్డి, సుధాకర్, కృష్ణుడు, ప్రకాష్ బాబు, సందీప్ నాయక్, సునీల్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

About Author