PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

5oవ డివిజన్ లో కో-ఆప్షన్ సభ్యులు విస్తృత ప్రచారం

1 min read

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి వైసిపి అభ్యర్థులను గెలిపించండని ఓటర్లకు విజ్ఞప్తి

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్నదే మన ధ్యేయం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన జరుగు అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేయుచున్న  ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయుచున్నరు. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారని వారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి విజయాన్ని అందించాలని  కోరారు. స్థానిక 50వ డివిజన్ఎం ఆర్ సి కాలనీలో నగరపాలక సంస్థ మేయర్ షేక్ కో-ఆప్షన్స్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాయకులు,కార్యకర్తలతో గడప-గడపకు తిరిగి ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి -సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మహిబాబు, కొల్లిపాక సురేష్, పొలిమేర హరికృష్ణ,గవరపేట నాయుడు,లారీల శీను, మానుకొండ శీను, దేవయ్య,మల్లేశ్వరరావు, ఉండి నాగేశ్వరరావు, పెదపూడి రాజు,కనకరాజు,కుర్మరాజు,నక్క కృష్ణ, సింగర్ శివ, ముఖ్య నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనారు.

About Author