PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు సేకరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ రోజు హోళగుంద వరద బాధితుల సహాయ సమాఖ్య ఆధ్వర్యంలో 2వ రోజు హోళగుంద మండల కేంద్రంలో విరాళాల సేకరణప్రభుత్వ జూనియర్ కళాశాల (మరియు) జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల (మరియు) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV)లో విద్యార్థులు కూడా మేము సైతం అంటూ తమకు తోచిన నగుదు సహాయాన్ని అందించడానికి విద్యార్థిని విద్యార్థులు ముందుకొచ్చిన సహాయం చేయడం జరిగింది.కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఉపాధ్యాయురాలు సిబ్బంది కూడా సహాయం చేయడం జరిగింది. విజయవాడ వరద బాధితులకు సహాయం  చేసినందుకు హోళగుంద వరద బాధితుల సహాయ సమాఖ్య గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.కులమత రాజకీయ మరియు విద్యార్థి యువజన సంఘాలకు అతీతంగా కుటుంబ సభ్యులుగా వరద బాధితులకు సహాయంగా నగదు బియ్యం విరాళంగా అందించి మానవత్వాన్ని  బ్రతికిద్దాం…కదలి రండి కలిసి రండి ఇసుక రేణువుల్లా ఏకమౌదం.సాటి మానవుడికి సహాయపడడమే సర్వధర్మల సారం.ఈ నగదు బియ్యం విరాళాల సేకరణ కార్యక్రమంలో వరద బాధితుల సహాయ సమాఖ్య…హోళగుంద గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు యువత కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *