PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూడో కోచ్ శాంతరాజు ను సన్మానించిన కలెక్టర్..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: క్రీడాకారులకు క్రీడలతోనే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా జూడో కోచ్ పెరుమాళ్ళ శాంతరాజు అన్నారు.ఇటీవల జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణ లోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఆగస్టు 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి.నంద్యాల జిల్లా చీఫ్ కోచ్ ఎం.ఎన్.వీ రాజు అధ్యక్షతన ఈ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి హాజరయ్యారు.రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దిన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని క్రీడా వికాస కేంద్రం(కేవీకే )లో పని చేయుచున్న నంద్యాల జిల్లా జూడో కోచ్ పెరుమాళ్ళ శాంత రాజు ను కలెక్టర్ సన్మానించారు.భవిష్యత్తులో మంచి క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో మరియు జాతీయస్థాయిలో గెలుపొందే విధంగా శిక్షణ ఇచ్చి నంద్యాల జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆయనకు సూచించారు.జూడో కోచ్ శాంతరాజును ఫిజికల్ డైరెక్టర్లు మరియు కోచ్ సిబ్బంది పలువురు ఆయనను అభినందించారు.

About Author