PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించిన కలెక్టర్​ ,జాయింట్​ కలెక్టర్​లకు ప్రసంశలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  APRSA జిల్లా శాఖ ఆధ్వర్యములో కర్నూల్ జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతముగా ఎటువంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయముగా నిర్వహించిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ గుమ్మళ్ల సృజన IAS., ని అలాగే  జాయింట్ కలెక్టర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య, IAS ని మరియు జిల్లా రెవిన్యూ అధికారి శ్రీ మధుసూధన్ రావుని కలిసి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేయడమైనది. ఈ సందర్భముగా జిల్లా అధ్యక్షులు గిరి కుమార్ రెడ్డి జిల్లా కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి వెంకటరాజు మాట్లాడుతూ సమస్యాత్మక జిల్లా గా పేరున్న కర్నూల్ జిల్లాలో ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్యోగులను ఎటువంటి ఒత్తిడి లేకుండా వారిని ప్రశాంతముగా విధులు నిర్వర్తించేలా సమన్వయము చేసి ప్రశాంత వాతావరణములో  ఎన్నికలు జరిపి దిగ్విజయం చేయుటలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా రెవిన్యూ అధికారి మరియు ఇతర రెవిన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో సఫలీకృతులయ్యారని, జిల్లాలో చిన్న అపశృతి జరుగకుండా ఎన్నికలు దిగ్విజయమవ్వడము గర్వకారణమని పేర్కొన్నారు. అధికారులను కలిసిన వారిలో  వేణుగోపాల్ రావు జిల్లా కోశాధికారి,ఆదోని డివిజన్  అధ్యక్షులు రజనీకాంత్ రెడ్డి,కర్నూల్ డివిజన్  అధ్యక్షులు రామాంజనేయులు పత్తికొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్సులు నాగరాజు & మల్లికార్జున కలెక్టరేటు కార్యదర్శి లోకేష్ మరియు ధనుంజయ రెడ్డి,సుధాకర్,కృష, వెంకటేశ్వర్లు, ఓంకార్, మహిళా సభ్యులు లోకేశ్వరి,కృష్ణవేణి, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

About Author