PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు

పల్లెవెలుగు వెబ్  కర్నూలు:  కర్నూలు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు అందరికీ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు అభినందనలు తెలియజేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేశారు. బాబురావు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళిక అబద్ధంగా ఎన్నికలు నిర్వహించిన కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రిటర్నింగ్ అధికారి శ్రీమతి సృజనకి, మరియు భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్కి మరియు పోలింగ్ సిబ్బందికి, పోలీసులకు, రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, కర్నూలు జిల్లా ప్రజలకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నదని ప్రశాంతంగా జరగడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని బాబురావు తెలియజేశారు.

About Author