PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాదవుల ఆత్మీయ సభను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్  వెలుగోడు: ఆత్మకూరు పట్టణంలో ఈనెల 25వ తేదీన నిర్వహించే యాదవుల ఆత్మీయ సభను యాదవులoతా తరలి వచ్చి విజయవంతం చేయాలని అఖిలభారత యాదవ మహాసభ జిల్లా నాయకులు  రఘు రాముడు యాదవ్,మండల నాయకులు నాగేశ్వరరావు యాదవ్ కోరారు.   యాదవుల ఐక్యతకు , వారి సమస్యల పరిష్కారం కొరకు సమావేశాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. రాయలసీమ జోనుకు చెందిన నంద్యాల జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆత్మకూరు లోని థెరిసా జూనియర్ కాలేజీ నందు ఆదివారం ఉదయం 10 గంటలకు  నిర్వహించే  ఈ సమావేశానికి నియోజకవర్గంలోని యాదవులంతా విరివిగా తరలిరావాలని కోరారు. ఈ మేరకు వెలుగోడు పట్టణంలో సమావేశానికి సంబంధించిన కరపత్రాలను  పంపిణీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో యాదవ సంఘ నిర్మాణము, యాదవ రాజుల చరిత్ర , రాష్ట్ర, జిల్లా నాయకులు  హాజరై తెలియజేస్తారనితెలిపారు.

About Author