PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నువిజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.నియోజకవర్గo లో పలు సమస్యలపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.ఎమ్మెల్యే జయసూర్య తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు పలు సమస్యలను సీఎం తో మాట్లాడారు.

About Author