PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు నిర్వహించాలి

1 min read

అసోసియేషన్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వర రావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం గన్ బజార్,క్రిస్టల్ కళ్యాణ మండపం(నబీ ఫంక్షన్ హాల్) నందు అధ్యక్షులు అరుణ తార నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన నాటి నుండి మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం  అమాయకులైన అసోసియేషన్ సభ్యులను ప్రలోభ పెట్టి తొమ్మిది నెలల కాలంలో నూతన కమిటీపై అనేక కోర్టు కేసులను పెట్టించారని విమర్శించారు.అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఆటోనగర్ భూములపై ఉన్న రిజంప్షన్ తొలగించుకోవడానికి, తిరిగి రిజిస్ట్రేషన్స్ జరిగేలా కమిటీ చేసే పోరాటాలలో సభ్యులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశాఖ పట్నం,కనుమం కొత్త ఆటోనగర్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు పఠాన్ ఖాజా వలి, కర్రి గణేష్ మాట్లాడుతూ నూతనంగా సభ్యత్వాలు, చేర్పించుకోవడం ద్వారా అసోసియేషన్ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పెరిగిన సభ్యులకు షెడ్లు ఏర్పాటు చేసుకొనడానికి మరికొంత స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని,స్థలం లేని సభ్యులకు అందజేయాలని,ఆ దిశగా కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు కలిసి పోరాడాలని ఆకాంక్షించారు.డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఆటోనగర్ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కమిటీ చర్యలు చేపట్టాలని  అందుకు అవసరమయ్యే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహ్మద్ సులేమాన్,ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వర రావు, సహాయ కార్యదర్శి మర్రాపు సత్యనారాయణ, కమిటీ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్, సయ్యద్ చోటే, గుమ్మళ్ళ వెంకట సూర్య నారాయణ, బుస్సే ప్రతాప్,అంగులూరి రాంబాబు, సిగిరెడ్డి సంజీవ రావు, గంటా జోగి రాజు, బోడా రాజు, షేక్ జుల్ఫీ తదితరులు పాల్గొన్నారు.

About Author